विवेचन सारांश
విభూతియోగము- విభూతుల వర్ణన
మనలోని అఙ్ఞానాంధకారాన్ని తొలగించి వెలుగు దారి చూపేలా ఆ కృష్ణపరమాత్మను, గురుదేవుని ,శారదామాత ను ప్రార్ధిస్తూ దీపప్రజ్వలన జరిపి, ఈనాటి వివేచనకు నాంది పలకడము అయినది.10వ అధ్యాయపు చివరి భాగాన్ని ఆశూజీ భయ్యా తమ సుమధురవాణి తో వివరించడం ప్రారంభించారు.మన పూర్వజన్మఫలం వలన మనకు ఈ భగవద్గీతా మహాగ్రంధాన్ని చదవి,అర్ధం చేసుకునే భాగ్యం కలిగింది.ఈ ఙ్ఞానధారలో మునిగెడి మహద్భాగ్యం మనకు కలిగింది.సరైన ఉచ్చారణతో ఈ శ్లోకాలు పాడగలగడం,వివేచనల ద్వారా అర్ధం తెలుసుకోగలగడం మన జీవనగమ్యం లో మనలను ముందుకు సవ్యంగా నడపడానికి తోడ్పడతాయి. ఆ గీతాబోధనలను మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడే సార్ధకత లభిస్తుంది. భగవానులు 15వ అధ్యాయం,11వ శ్లోకంలో చెప్పినట్లు అంతఃకరణశుధ్ధి వలన మాత్రమే ఈ ఙ్ఞానాన్ని మనం పొందగలము. యోగులు,తపస్వులు నిద్రాహారాలు మాని ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేసినా మనసు పవిత్రం గా లేకుంటే లక్ష్యసిధ్ధి పొందలేరు.
ఎప్పుడైతే మనము గీతానుసారంగా అన్ని కార్యాలు చేస్తూ, అంతరంగాన్ని స్వచ్చంగా వుంచుతూ, సంసారజీవితపు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ జీవితగమనాన్ని సాగిస్తామో అప్పుడు మనము ఆ హిమాలయాలలో తపస్సు చేసే మునులకంటే కూడా తేలికగా పరమాత్మని పొందగలము. భగవద్గీతా వచనాలను తమ జీవితాలలో అమలుచేసే ఏ వ్యక్తి అయినా అసత్యాలు పలకడు,ఇతరులకు హాని చేయడు, ఎల్లప్పుడు ప్రతిఫలాపేక్ష లేని కార్యాలలోనే నిమగ్నుడౌతాడు.సకల జీవజాతుల పట్ల దయాభావం వుండడం వలన అట్టి వ్యక్తుల మనసు , ఆత్మ కూడా ఎంతో శుధ్ధమవుతాయి. రహదారులపై ఉన్న వ్యర్ధాలను శుభ్రం చేయడం లో సాయపడడం, తోటివారినుండి ఏమీ ఆశించకుండా సాయపడడం నిష్కామకర్మలు అనబడతాయి. మన అంతఃకరణ శుధ్ధికి ఈ కర్మలు చేయడం ఎంతో ఆవశ్యకము.
ఎప్పుడైతే మనము గీతానుసారంగా అన్ని కార్యాలు చేస్తూ, అంతరంగాన్ని స్వచ్చంగా వుంచుతూ, సంసారజీవితపు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ జీవితగమనాన్ని సాగిస్తామో అప్పుడు మనము ఆ హిమాలయాలలో తపస్సు చేసే మునులకంటే కూడా తేలికగా పరమాత్మని పొందగలము. భగవద్గీతా వచనాలను తమ జీవితాలలో అమలుచేసే ఏ వ్యక్తి అయినా అసత్యాలు పలకడు,ఇతరులకు హాని చేయడు, ఎల్లప్పుడు ప్రతిఫలాపేక్ష లేని కార్యాలలోనే నిమగ్నుడౌతాడు.సకల జీవజాతుల పట్ల దయాభావం వుండడం వలన అట్టి వ్యక్తుల మనసు , ఆత్మ కూడా ఎంతో శుధ్ధమవుతాయి. రహదారులపై ఉన్న వ్యర్ధాలను శుభ్రం చేయడం లో సాయపడడం, తోటివారినుండి ఏమీ ఆశించకుండా సాయపడడం నిష్కామకర్మలు అనబడతాయి. మన అంతఃకరణ శుధ్ధికి ఈ కర్మలు చేయడం ఎంతో ఆవశ్యకము.
10.26
అశ్వత్థః(స్) సర్వవృక్షాణాం(న్), దేవర్షీణాం(ఞ్) చ నారదః৷
గన్ధర్వాణాం(ఞ్) చిత్రరథః(స్), సిద్ధానాం(ఙ్) కపిలో మునిః৷৷26॥
వృక్షములలో నేను అశ్వత్థమును (రావిచెట్టును). దేవర్షులలో నారదుడను నేను. గంధర్వులలో నేను చిత్రరథుడను. సిద్ధులలో నేను కపిలమునిని.
అందరి దృష్టిలో భగవద్గీతా లోని విభూతి యోగము ఎంతో ప్రముఖమైనది. ఆ పరమాత్ముని దివ్యవిభూతులను అర్జునుని ద్వారా తెలుసుకోగలిగే అదృష్టాన్ని మానవులకు కలిగిస్తుంది . భగవానులు ఈ శ్లోకంలో వృక్షములన్నిటిలోను, తాను అశ్వధ్ధ వృక్షముగాను, నదులలో గంగానది గాను ఉంటానని తెలిపారు.అంటే మిగిలిన వృక్షాలలో, నదులలో ఉండడని కాదు. దీనిని తెలుసుకోవడానికి రెండు మార్గాలు వున్నాయి. ఒకటి తత్వ దృష్టి, రెండు వ్యవహారిక దృష్టి. ఉదాహరణలతో అర్థం చేసుకుందాము. ఇనుముతో తయారైన ఒక వాష్ బేసిన్, ఒక పళ్ళెం తీసుకుందాము.
తినే పదార్థాన్ని మనం పళ్ళెంలో పెడతాము కాని, వాష్ బేసిన్ లోపెట్టము. తత్వదృష్టితో చూసే వారు రెండూ ఒకే పదార్థంతో చేసినవి కాబట్టి ఒకటిగానే భావిస్తారు. వ్యవహారిక దృష్టితో చూసేవారికి ఏ వస్తువు ఎలా వాడాలో తెలుసు కనుక వాష్ బేసిన్ను, పళ్ళాన్ని వేరు వేరుగా చూస్తారు. తినే పదార్ధాన్ని పళ్ళెంలోనే పెడతారు. మనము నగల దుకాణానికి వెళ్ళి బంగారం కొనేటప్పుడు ఆ నగ యొక్క డిజైను, మెరుగు చూస్తాము. వ్యవహారిక దృష్టితో చూసినప్పుడు దాని వాడుక గురించి కూడా ఆలోచిస్తాము.ఇదే వస్తువుని అమ్మాలని చూసినప్పుడు దాని డిజైను, మొదలైనవి ఏమీ లెక్కలోనికి రావు. మూలపదార్థమైన బంగారమే లెక్కలోనికి వస్తుంది. అలాగే గాలిలో,నీటిలో కూడా ఆక్సిజన్, హైడ్రోజన్ ఉంటాయి. తత్వదృష్టి తో చూస్తే గాలిలో, నీటిలో ఉన్న ఈ మూలకాలని తీసుకున్నట్టు భావిస్తాము. అదే వ్యవహారిక దృష్టి తో అయితే నీరుగానే చూస్తాము.అగ్గిపుల్లనుకాని,రెండు రాళ్ళను కాని రాపిడికి గురిచేసినప్పుడే వాటినుండి అగ్ని వెలువడుతుంది.అదేవిధంగా భగవానుడు నదులన్నిటిలో ఉన్నా, గంగానదిలో మాత్రం ప్రత్యక్షంగా అగుపడుతాడు. ఆయన విభూతులు మనము కొన్నిటిలోనే చూడగలము. ఉత్తరకాండ లో శ్రీరామచంద్రుడు అయోధ్యవాసులందరూ తనకెంతో ప్రియతములని చెపుతారు. ఆ రామచంద్రుడే సుందరకాండలో విభీషణుడుతో తనకు అతను భరతునితో సమానుడని సెలవిస్తారు. సకలజనులు తనకు అత్యంత ప్రియులని చెప్పినప్పుడు తత్వదృష్టితోను, విభీషణుడు తనకు భరతుని వలే సోదర సమానుడని చెప్పినప్పుడు భరతుని ఒక ప్రత్యేక వ్యక్తి గాను వివరించారు. పరమాత్మకు భరతునిపై గల ప్రేమ ఆయనను అంత ప్రత్యేకవ్యక్తిగా నిలిపింది. అదేవిధంగా భగవానులు తాను దేవతలచే కూడా పూజలందుకునే నారదుడినని, గంధర్వులలో చిత్రరధుడనని, సిద్ధపురుషుడు, దేవహుతి కుమారుడు అయిన కపిలుడినని ఈశ్లోకంలో తెలిపారు. ఇంకా తన విభూతులను , పరమాత్మ ముందు చదవబోయే శ్లోకాలలో వివరించారు.
తినే పదార్థాన్ని మనం పళ్ళెంలో పెడతాము కాని, వాష్ బేసిన్ లోపెట్టము. తత్వదృష్టితో చూసే వారు రెండూ ఒకే పదార్థంతో చేసినవి కాబట్టి ఒకటిగానే భావిస్తారు. వ్యవహారిక దృష్టితో చూసేవారికి ఏ వస్తువు ఎలా వాడాలో తెలుసు కనుక వాష్ బేసిన్ను, పళ్ళాన్ని వేరు వేరుగా చూస్తారు. తినే పదార్ధాన్ని పళ్ళెంలోనే పెడతారు. మనము నగల దుకాణానికి వెళ్ళి బంగారం కొనేటప్పుడు ఆ నగ యొక్క డిజైను, మెరుగు చూస్తాము. వ్యవహారిక దృష్టితో చూసినప్పుడు దాని వాడుక గురించి కూడా ఆలోచిస్తాము.ఇదే వస్తువుని అమ్మాలని చూసినప్పుడు దాని డిజైను, మొదలైనవి ఏమీ లెక్కలోనికి రావు. మూలపదార్థమైన బంగారమే లెక్కలోనికి వస్తుంది. అలాగే గాలిలో,నీటిలో కూడా ఆక్సిజన్, హైడ్రోజన్ ఉంటాయి. తత్వదృష్టి తో చూస్తే గాలిలో, నీటిలో ఉన్న ఈ మూలకాలని తీసుకున్నట్టు భావిస్తాము. అదే వ్యవహారిక దృష్టి తో అయితే నీరుగానే చూస్తాము.అగ్గిపుల్లనుకాని,రెండు రాళ్ళను కాని రాపిడికి గురిచేసినప్పుడే వాటినుండి అగ్ని వెలువడుతుంది.అదేవిధంగా భగవానుడు నదులన్నిటిలో ఉన్నా, గంగానదిలో మాత్రం ప్రత్యక్షంగా అగుపడుతాడు. ఆయన విభూతులు మనము కొన్నిటిలోనే చూడగలము. ఉత్తరకాండ లో శ్రీరామచంద్రుడు అయోధ్యవాసులందరూ తనకెంతో ప్రియతములని చెపుతారు. ఆ రామచంద్రుడే సుందరకాండలో విభీషణుడుతో తనకు అతను భరతునితో సమానుడని సెలవిస్తారు. సకలజనులు తనకు అత్యంత ప్రియులని చెప్పినప్పుడు తత్వదృష్టితోను, విభీషణుడు తనకు భరతుని వలే సోదర సమానుడని చెప్పినప్పుడు భరతుని ఒక ప్రత్యేక వ్యక్తి గాను వివరించారు. పరమాత్మకు భరతునిపై గల ప్రేమ ఆయనను అంత ప్రత్యేకవ్యక్తిగా నిలిపింది. అదేవిధంగా భగవానులు తాను దేవతలచే కూడా పూజలందుకునే నారదుడినని, గంధర్వులలో చిత్రరధుడనని, సిద్ధపురుషుడు, దేవహుతి కుమారుడు అయిన కపిలుడినని ఈశ్లోకంలో తెలిపారు. ఇంకా తన విభూతులను , పరమాత్మ ముందు చదవబోయే శ్లోకాలలో వివరించారు.
ఉచ్చైఃశ్రవసమశ్వానాం(వ్ఁ) , విద్ధి మామమృతోద్భవమ్৷
ఐరావతం(ఙ్) గజేన్ద్రాణాం(న్), నరాణాం(ఞ్) చ నరాధిపమ్৷৷27॥
అశ్వములలో పాలసముద్రమునుండి అమృతముతో పుట్టిన ఉచ్చైఃశ్రవమును నేను. భద్రగజములలో ఐరావతమును నేను. మనుష్యులలో ప్రభువును నేను.
దానవులు,దేవతలు అమృతం కోసం క్షీరసాగరమధనం జరిపినప్పుడు జనియించిన ఉచ్చైశ్వము , ఐరావతము తానే అని భగవానులు తెలుపుతున్నారు. ఈ రెండూ అమృతం తో పాటూ ఉద్భవించడంవలన ప్రత్యేకతను పొందిఉన్నాయి. భగవానుని స్వరూపాలుగా ప్రసిద్ధిచెందాయి. నరులలో ప్రజారంజకుడైన రాజు భగవత్స్వరూపుడని, అది తన స్వరూపమే అని పరమాత్మ విశదీకరించారు.
ఆయుధానామహం(వ్ఁ) వజ్రం(న్), ధేనూనామస్మి కామధుక్৷
ప్రజనశ్చాస్మి కన్దర్పః(స్), సర్పాణామస్మి వాసుకిః৷৷28॥
ఆయుధములలో వజ్రాయుధమును నేను. పాడిఆవులలో కామధేనువును నేను. శాస్త్రవిహితరీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మథుడను నేను. సర్పములలో వాసుకిని నేను.
తాను ఆయుధాలలో వజ్రాయుధము, గోవులలో కామధేనువు, సకలజనోత్పత్తికి కారణభూతుదైన ప్రేమదేవత మన్మధుడినని, సర్పములలో వాసుకినని తెలుపుతున్నారు.
ఆయుధాలు రెండు రకాలు. దూరం నుండి విసిరేది అస్త్రము (బాణము,కర్ర వంటివి), చేతిలోనికి తీసుకుని పోరాడేది శస్త్రం ( కత్తి,గద వంటివి ).ఇట్టి ఆయుధాలలో దధీచిముని ఎముకలతో వ్రిత్రాసుర అనే దానవున్ని వధించడం కోసం తయారుచేయబడిన వజ్రాయుధం ఎంతో ప్రాముఖ్యమైనది. భగవానుని రూపమైన ఆ వజ్రాయుధం వలననే దేవేంద్రుడు తన దేవలోకాన్ని తిరిగి పొందగలిగాడు. కామధేనువు గోవులన్నిటిలో శ్రేష్టమైనది. ఏది కోరినా సమృద్ధిగా ప్రసాదిస్తుంది. కామధేనువు కుమార్తె నందిని , వశిష్ట ముని ఆశ్రమంలో వుండేది. ఒకసారి మహారాజు కౌషికుడు తన సేనతో వశిష్టుని ఆశ్రమాన్ని సందర్శించడంతో ఆ ముని వారందరికి షడ్రషోపేతమైన విందు తో అలరించాడు.ఆ అరణ్యంలో అంతమందికి ఇంతమంచి విందు లభించడంతో ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యపడినదని కౌషికుడు మునిని ప్రశ్నించాడు.కోరినదల్లా ఒసగే కామధేనువు తనయ నందిని తనవద్ద ఉండడం వలన ఇది సాధ్యపడినట్లు వశిష్టుడు చెప్పడం తో ,అటువంటి ధేనువు మహారాజైన తనవద్ద వుంటే మిక్కిలి ఉపయోగకరమని భావించి, తనకు ఆ గోవుని ఇవ్వవలసినదిగా అఙ్ఞాపించాడు. అది వీలుపడదని ఆ ముని వినయంగా చెప్పినా కౌషికుడు వినకుండా రాజుననే అహంకారం తో ఆ అశ్రమాన్ని తన సేనతో ముట్టడించాడు. వెంటనే నందిని దేహమునుండి లక్షలాది సైనికులు వెలువడి కౌషికుడి సేనను ఓడించారు. గర్వభంగమైన కౌషికుడు వశిష్టుడి వలే మహర్షి కావాలని, ఎన్నో ప్రయత్నాలు, ఘోరతపస్సులు చేసి,ఎట్టకేలకు బ్రహ్మదేవుని కృపతో బ్రహ్మర్షి విశ్వామిత్ర గా ప్రఖ్యాతి నొందాడు.
ఆయుధాలు రెండు రకాలు. దూరం నుండి విసిరేది అస్త్రము (బాణము,కర్ర వంటివి), చేతిలోనికి తీసుకుని పోరాడేది శస్త్రం ( కత్తి,గద వంటివి ).ఇట్టి ఆయుధాలలో దధీచిముని ఎముకలతో వ్రిత్రాసుర అనే దానవున్ని వధించడం కోసం తయారుచేయబడిన వజ్రాయుధం ఎంతో ప్రాముఖ్యమైనది. భగవానుని రూపమైన ఆ వజ్రాయుధం వలననే దేవేంద్రుడు తన దేవలోకాన్ని తిరిగి పొందగలిగాడు. కామధేనువు గోవులన్నిటిలో శ్రేష్టమైనది. ఏది కోరినా సమృద్ధిగా ప్రసాదిస్తుంది. కామధేనువు కుమార్తె నందిని , వశిష్ట ముని ఆశ్రమంలో వుండేది. ఒకసారి మహారాజు కౌషికుడు తన సేనతో వశిష్టుని ఆశ్రమాన్ని సందర్శించడంతో ఆ ముని వారందరికి షడ్రషోపేతమైన విందు తో అలరించాడు.ఆ అరణ్యంలో అంతమందికి ఇంతమంచి విందు లభించడంతో ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యపడినదని కౌషికుడు మునిని ప్రశ్నించాడు.కోరినదల్లా ఒసగే కామధేనువు తనయ నందిని తనవద్ద ఉండడం వలన ఇది సాధ్యపడినట్లు వశిష్టుడు చెప్పడం తో ,అటువంటి ధేనువు మహారాజైన తనవద్ద వుంటే మిక్కిలి ఉపయోగకరమని భావించి, తనకు ఆ గోవుని ఇవ్వవలసినదిగా అఙ్ఞాపించాడు. అది వీలుపడదని ఆ ముని వినయంగా చెప్పినా కౌషికుడు వినకుండా రాజుననే అహంకారం తో ఆ అశ్రమాన్ని తన సేనతో ముట్టడించాడు. వెంటనే నందిని దేహమునుండి లక్షలాది సైనికులు వెలువడి కౌషికుడి సేనను ఓడించారు. గర్వభంగమైన కౌషికుడు వశిష్టుడి వలే మహర్షి కావాలని, ఎన్నో ప్రయత్నాలు, ఘోరతపస్సులు చేసి,ఎట్టకేలకు బ్రహ్మదేవుని కృపతో బ్రహ్మర్షి విశ్వామిత్ర గా ప్రఖ్యాతి నొందాడు.
అనన్తశ్చాస్మి నాగానాం(వ్ఁ) , వరుణో యాదసామహమ్৷
పితౄణామర్యమా చాస్మి, యమః(స్) సంయమతామహమ్৷৷29॥
నాగజాతివారిలో ఆదిశేషుడ(అనంతుడ)ను నేను. జలచరములకు అధిపతియైన వరుణుడను నేను. పితరులలో అర్యముడను (పితృగణప్రభువును) నేను. శాసకులలో యమధర్మరాజును నేను.
వేయిపడగలతో ఉన్న అనంతునిపై విష్ణుమూర్తి పవళించి ఉంటారు. పరమాత్మ దుష్టరక్షణకు భూలోకంలో అవతారమెత్తినప్పుడు ఈ శేషనాగుడే లక్ష్మణ, బలరామ అవతారాలలో పరమాత్మకి తోడయ్యారు. పితృదేవతలు కావ్యవ,అనల్, సోం, ఆర్యమ అని నలుగురు వుంటారు. వీరిలో ఆర్యమ పితృలోకానికి అధిపతి. మనము మన పూర్వికులకు శ్రాద్ధకర్మలలో అర్పించేవన్నీ ఆర్యమ ద్వారా మన పితరులకు అందుతాయి. ధర్మరక్షకుడిగా పాపులకు శిక్షలు అమలుచేస్తూ మృత్యుదేవతగా పేరొందిన యమధర్మరాజు, జలవాసులలో వరుణుడు, పితృలోకాధిపతి ఆర్యమ,అనంత శేషనాగుడు తానే అని ఈ శ్లోకంలో పరమాత్మ తెలుపుతున్నారు.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం(ఙ్) ,కాలః(ఖ్)కలయతామహమ్৷
మృగాణాం(ఞ్) చ మృగేన్ద్రో౽హం(వ్ఁ), వైనతేయశ్చ పక్షిణామ్৷৷30॥
దైత్యులలో నేను ప్రహ్లాదుడను. గణించువారిలో (గణకులలో) నేను కాలమును. మృగములలో మృగరాజు ఐన సింహమును నేను. పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడను నేనే.
దానవకులంలో, నారాయణవిరోధి అయిన తండ్రికి జన్మించినా కూడా , ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి, విశ్వములోని సమస్తాన్ని అణచగల కాలాన్ని, మృగాలలో సింహాన్ని, పక్షిగణాలలో గరుత్మంతుడిని నేనే అని కృష్ణపరమాత్మ అర్జునునికి ఈ శ్లోకంలో వివరించారు.
నాలుగు కాళ్ళు గల జీవిని మృగము అంటారు. గరుత్మంతుని దృష్టి ఎంతో తీక్షణమైనది. దూరదృష్టి, సూక్ష్మదృష్టి గల పక్షిరాజము.అందువలననే భగవానుని విభూతి అవ్వగలిగినది.
నాలుగు కాళ్ళు గల జీవిని మృగము అంటారు. గరుత్మంతుని దృష్టి ఎంతో తీక్షణమైనది. దూరదృష్టి, సూక్ష్మదృష్టి గల పక్షిరాజము.అందువలననే భగవానుని విభూతి అవ్వగలిగినది.
పవనః(ఫ్) పవతామస్మి, రామః(శ్) శస్త్రభృతామహమ్৷
ఝషాణాం(మ్) మకరశ్చాస్మి, స్రోతసామస్మి జాహ్నవీ৷৷31॥
పవిత్రమొనర్చు వానిలో వాయువును నేను, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానదిని నేను.
జలము ఎటువంటి మురికినైనా కడిగివేయగలిగినా, వాయువు సోకడం వలననే పూర్తిగా శుద్ధి కాబడుతుంది. బంగారము, వెండి లతో చేయబడిన పాత్రలు నీటితో మరియు వాయువుతోనే శుభ్రపడతాయి. మిగిలిన ఏ పాత్రలైనా మట్టి, బూడిదలతో తోమబడి తరువాత నీటితో కడగబడి, గాలిలో ఆరవేయబడతాయి. అందువలన ఏ వస్తువైనా పూర్తిగా శుభ్రపడేది వాయువు ద్వారానే. అందుకే అట్టి వాయువు నా స్వరూపమే అని పరమాత్మ తెలుపుతున్నారు. శ్రీరామచండ్రుడు పురుషోత్తముడు.ఆయన బాణానికి ఒక ప్రత్యేక గుణము ఉంది. దానిని ఎవరిపైనైనా ప్రయోగిస్తే వారిని సంహరించి ,తిరిగి రాములవారి వద్దకే చేరుతుంది.అందుకే రామబాణానికి తిరుగు లేదు. అట్టి రామబాణము,అట్టి ధీరోత్తమరాముడు కూడా తానే అని, జలచరాలలో మొసలి, పవిత్ర నదులలో గంగామాత తన రూపాలే అని భగవానులు తెలుపుతున్నారు. గంగోత్రిలో పుట్టిన గంగానది 14పవిత్రప్రాంతాలగుండా ప్రవహించి, ఋషీకేష్, హరిద్వార్, ప్రయాగ్, గంగాసాగర్ చేరి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈమూడు ప్రాంతాలు పుణ్యతిధులలో పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి కాంచినవి. అందువలననే గంగానది భగవానుని విభూతి. ప్రయాగ లో జరిగే కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేస్తున్న లక్షలాది భక్తులను చూసి ఆశ్చర్యపడి, ఒక విదేశీయుడు స్వామీజీని అడిగారు. ఇంతమందిని ఇక్కడకు రప్పించేలా ప్రకటన ఎలా చేస్తారు అని. పంచాంగాలలో "మౌని అమావాస్య" తిధి ప్రకటిస్తే చాలని, అదే లక్షలాది భక్తులను సంవత్సరాల నుండి పుణ్యస్నానంకోసం ఇక్కడకు రప్పిస్తున్నదని తెలిపారు.
సర్గాణామాదిరన్తశ్చ ,మధ్యం(ఞ్) చైవాహమర్జున৷
అధ్యాత్మవిద్యా విద్యానాం(వ్ఁ), వాదః(ఫ్) ప్రవదతామహమ్৷৷32॥
ఓ అర్జునా! సృష్టికి ఆదిమధ్యాంతములు నేను. (సృష్టి స్థితిలయ కారకుడను నేనే). విద్యలలో అధ్యాత్మవిద్యను అనగా బ్రహ్మవిద్యను నేను. పరస్పరవాదవివాదములలో తత్త్వనిర్ణయమునకై చేయు 'వాదము'ను నేను.
సృష్టికి ఆది మధ్యంతరాలు, అధ్యాత్మిక విద్యయందు అత్యున్నతమైన, శాంతియుతమైన, ఆనందభరితమైన బ్రహ్మవిద్య, తానేనని భగవానులు తెలుపుతున్నారు.వాద ప్రతివాదాలలో సక్రమవాదము భగవంతుడే.
వాదనలు నాలుగు రకాలు ;
1.జల్పము _ తన వాదాన్ని బలపరుస్తూ,ఎదుటివారి వాదనను ఖండించడం. దీనిలో తన పక్షసమర్ధన మాత్రమే ఉంటుంది.
2. వితండవాదన _ ఎదుటివారిని దుర్భాషలాడుతూ ,వారి వాదనలను ఖండించడం.
3. వివాదం _ తప్పు ఒప్పుల ప్రమేయం లేకుండా,కేవలం తన వాదనే సరైనదని వాదించడం.
4. వాదం _ ఇరుపక్షాల సంభాషణ తర్వాత ఇరుపక్షాలు ధర్మాన్ని, సత్యాన్ని అంగీకరించడం .తత్వాన్వేషణ తో చేయబడే ప్రశ్నోత్తరాలే వాదము. ఇది ఎంతో శ్రేష్టమైన సంవాదము.
కొందరు వ్యక్తులు భూమికి మధ్యభాగము ఏదో తెలుసుకోవడానికి అటువైపుగా వెళ్తున్న ఒక ఉపాధ్యాయున్ని పిలిచి అడిగారు. భూమి గుండ్రంగా వుండడం వలన ఏ ప్రాంతమైనా దాని మధ్యభాగం కాగలదని అతను చెప్పాడు. ఈ విశ్వము అనంతమైనది. భూమిని ఈ విశ్వము లోని మధ్యభాగముగా అనుకుంటే 93బిలియన్ కాంతి సంవత్సరాలు ఈ విశ్వపు వ్యాసము. భూమికి ఇరువైపుల చెరో 46 బిలియన్ కాంతి సంవత్సరాలు గా కొలవవచ్చు. ముందుగా మహాతత్వము, తరువాత పంచతత్వము, దీనినుండి పంచభూతములు సృష్టించబడినవి.పరమాత్మ అర్జునునికి తెలిపినట్లు సూక్ష్మ రూపములో వున్న వే మనము లెక్కించగలిగినవి.ఈ విశ్వంలో కొన్ని కోట్ల సూర్యులు ,గెలక్సీలు సృష్టించబడి, నశిస్తూ వుంటాయి. ఒక పెన్ ను వాడిన తర్వాత పడేస్తే ,తిరిగి దానిని రిసైకిల్ చేయడం వలన వేరొక రూపంలోనికి మారుతుంది.అదేవిధంగా ఈ విశ్వంలో దేనినీ మనము సృష్టించలేము, నశింపచేయలేము. వేరొకరూపం లో పంచతత్వాలలో కలుస్తుంది.
ఒక కుండలోనికి సముద్రాన్ని నింపాలనుకుంటే దానిని అదే సముద్రంలోనికి విసరివేస్తే ఆ కుండ ఆనీటి అడుగుకి చేరడం వలన సముద్రపునీరంతా ఆ కుండలో ఉన్నట్లే అవుతుంది. అదేవిధంగా మనం పరమాత్మ యొక్క శక్తిని, ఉనికిని తెలుసుకోవాలంటే మన బుద్ధిని ఉపయోగించాలి. ఆయనను శరణు కోరినప్పుడు, మన మనసును, ఆత్మను ఆయనకు సమర్పించినప్పుడు మాత్రమే ఆ పరమాత్మ మహిమను తెలుసుకోగలము. పరమాత్మను మనం తెలుసుకోవాలంటే మనలని మనం మరచిపోవాలి.
వాదనలు నాలుగు రకాలు ;
1.జల్పము _ తన వాదాన్ని బలపరుస్తూ,ఎదుటివారి వాదనను ఖండించడం. దీనిలో తన పక్షసమర్ధన మాత్రమే ఉంటుంది.
2. వితండవాదన _ ఎదుటివారిని దుర్భాషలాడుతూ ,వారి వాదనలను ఖండించడం.
3. వివాదం _ తప్పు ఒప్పుల ప్రమేయం లేకుండా,కేవలం తన వాదనే సరైనదని వాదించడం.
4. వాదం _ ఇరుపక్షాల సంభాషణ తర్వాత ఇరుపక్షాలు ధర్మాన్ని, సత్యాన్ని అంగీకరించడం .తత్వాన్వేషణ తో చేయబడే ప్రశ్నోత్తరాలే వాదము. ఇది ఎంతో శ్రేష్టమైన సంవాదము.
కొందరు వ్యక్తులు భూమికి మధ్యభాగము ఏదో తెలుసుకోవడానికి అటువైపుగా వెళ్తున్న ఒక ఉపాధ్యాయున్ని పిలిచి అడిగారు. భూమి గుండ్రంగా వుండడం వలన ఏ ప్రాంతమైనా దాని మధ్యభాగం కాగలదని అతను చెప్పాడు. ఈ విశ్వము అనంతమైనది. భూమిని ఈ విశ్వము లోని మధ్యభాగముగా అనుకుంటే 93బిలియన్ కాంతి సంవత్సరాలు ఈ విశ్వపు వ్యాసము. భూమికి ఇరువైపుల చెరో 46 బిలియన్ కాంతి సంవత్సరాలు గా కొలవవచ్చు. ముందుగా మహాతత్వము, తరువాత పంచతత్వము, దీనినుండి పంచభూతములు సృష్టించబడినవి.పరమాత్మ అర్జునునికి తెలిపినట్లు సూక్ష్మ రూపములో వున్న వే మనము లెక్కించగలిగినవి.ఈ విశ్వంలో కొన్ని కోట్ల సూర్యులు ,గెలక్సీలు సృష్టించబడి, నశిస్తూ వుంటాయి. ఒక పెన్ ను వాడిన తర్వాత పడేస్తే ,తిరిగి దానిని రిసైకిల్ చేయడం వలన వేరొక రూపంలోనికి మారుతుంది.అదేవిధంగా ఈ విశ్వంలో దేనినీ మనము సృష్టించలేము, నశింపచేయలేము. వేరొకరూపం లో పంచతత్వాలలో కలుస్తుంది.
ఒక కుండలోనికి సముద్రాన్ని నింపాలనుకుంటే దానిని అదే సముద్రంలోనికి విసరివేస్తే ఆ కుండ ఆనీటి అడుగుకి చేరడం వలన సముద్రపునీరంతా ఆ కుండలో ఉన్నట్లే అవుతుంది. అదేవిధంగా మనం పరమాత్మ యొక్క శక్తిని, ఉనికిని తెలుసుకోవాలంటే మన బుద్ధిని ఉపయోగించాలి. ఆయనను శరణు కోరినప్పుడు, మన మనసును, ఆత్మను ఆయనకు సమర్పించినప్పుడు మాత్రమే ఆ పరమాత్మ మహిమను తెలుసుకోగలము. పరమాత్మను మనం తెలుసుకోవాలంటే మనలని మనం మరచిపోవాలి.
అక్షరాణామకారో౽స్మి ,ద్వన్ద్వః(స్)సామాసికస్య చ৷
అహమేవాక్షయః(ఖ్) కాలో, ధాతాహం(వ్ఁ) విశ్వతోముఖః৷৷33॥
అక్షరములలో "అ" కారమును నేను. సమాసములలో 'ద్వంద్వ' సమాసమును నేను. అక్షయకాలము అనగా మహాకాలమును నేను. అట్లే విశ్వతోముఖుడైన విరాట్ పురుషుడను నేను. అందరిని ధరించువాడను, పోషించువాడను నేను.
ఈ శ్లోకంలో ఇంకా తన విభూతుల గురించి పరమాత్మ తెలుపుతున్నారు.అ కారము లేకుండా అక్షరాలు చెప్పలేము. అలాగే ముఖ్య సమాసాలైన అవ్యయీభావ( యధాశక్తి, ప్రతిక్షణము) ,తత్పురుష ( అకాల) , బహువ్రీహి (దశానన, ధనంజయ ), ద్వంద్వ (సుఖ దుఃఖ, మానాపమాన )సమాసాలు కూడా వ్యాకరణములో ముఖ్యమైనవి. అక్షరాలలో అ కారము, సమాసాలలోని ద్వంద్వ సమాసము,నాశరహితమైన కాలము, అందరినీ పాలించే విరాట్ స్వరూపుడను నేనే అని భగవానులు తెలుపుతున్నారు.విశ్వతోముఖుడైన ఆ పరమాత్మయే ఈ జగతికి పాలకుడు.
మృత్యుః(స్) సర్వహరశ్చాహమ్,ఉద్భవశ్చ భవిష్యతామ్৷
కీర్తిః(శ్) శ్రీర్వాక్చ నారీణాం(మ్), స్మృతిర్మేధా ధృతిః క్షమా৷৷34॥
అన్నిప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్తప్రాణుల ఉత్పత్తి హేతువును గూడ నేనే. స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమా అను వారందఱును నేనే.
ఈ శ్లోకంలో పరమాత్మ తానే ఈ జగత్తును సృష్టించేది, భరించేది, చివరకు నశింపచేసేది అని తెలుపుతున్నారు. స్త్రీలలో బాహ్య గుణాలైన కీర్తి, సంపద, వాక్కు, అంతరగుణాలైన స్మృతి, మేధ, ధైర్యము, క్షమా గుణము ల వంటి అత్యున్నత గుణాలన్నీ ఆ భగవానుని స్వరూపాలే. కీర్తి, మేధ, ధ్రితి, స్మృతి, క్షమ లు దక్షుని కుమార్తెలు.శ్రీ ( సంపద)అనగా లక్ష్మి, భ్రుగు మహర్షి కుమార్తె, వాక్కు లేదా సరస్వతి బ్రహ్మ మానసపుత్రిక. భగవానుని స్వరూపం కనుకనే ఎవరినైనా గౌరవంగా సంబోధించడానికి , వారి పేర్ల ముందు శ్రీమాన్, శ్రీమతి అని పెడతాము.
బృహత్సామ తథా సామ్నాం(ఙ్), గాయత్రీ ఛన్దసామహమ్৷
మాసానాం(మ్) మార్గశీర్షో౽హమ్, ఋతూనాం(ఙ్) కుసుమాకరః৷৷35॥
గానముచేయుటకు అనువైన శ్రుతులలో బృహత్సామమును నేను. ఛందస్సులలో 'గాయత్రీఛందస్సు'ను నేను. మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును నేనే.
సామవేదము నేనే అని భగవానులు ప్రారంభశ్లోకాలలో తెలిపారు. ఇది ఎంతో అందమైన గీతములతో నిండి ఉంటుంది.ఆ గీతములలో ఇంకా అందమైన బృహత్సామ గీతము తానే అని, తాను అర్జునునికి భగవద్గీతాను ఉపదేశించిన మార్గశిర మాసము, మరియు సమశీతోష్ణముతో ఎంతో ఉల్లాసకరంగా పచ్చని వృక్షాలతో కనువిందుచేసే వసంతఋతువు కూడా తానే అని భగవానులు తెలుపుతున్నారు.మహర్షి విశ్వామిత్రుడు బ్రహ్మఋషి కావడానికి చేసిన తపస్సులలో గాయత్రీమంత్రం ఉద్భవించినది.ఎంతో విశిష్టత గల ఈ గాయత్రీమంత్రము కూడా భగవద్ స్వరూపమే.
ద్యూతం(ఞ్) ఛలయతామస్మి, తేజస్తేజస్వినామహమ్৷
జయో౽స్మి వ్యవసాయో౽స్మి, సత్త్వం(మ్) సత్త్వవతామహమ్৷৷36॥
వంచకులలో జూదమును నేనే. ప్రభావశాలురలోని ప్రభావమును నేను. విజేతలలో విజయమును నేను. నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్త్విక పురుషులలో సాత్త్వికభావమును నేనే.
కేవలం మంచివాటిలోనే కాక తన విభూతులను పరమాత్మ, లోకంలో చెడుగా భావించే జూదము కూడా నేనే అని తెలిపారు. అట్టి క్రీడలకు కూడా తెలివి కావాలి,ఆ తెలివి భగవదంశయే. కాని ఆ తెలివిని దుర్వినియోగం చేస్తే ఆ ఫలితం మనమే అనుభవించవలసి వస్తుంది. ఏ కార్యమైనా సాధించాలంటే దృఢనిశ్చయం ఉండాలి. అప్పుడే విజయం లభిస్తుంది. అట్టి విజయము,తేజస్సు, బలవంతులలోని బలము పరమాత్మయే. సాత్వికమానవులలోని సాత్వికగుణము కూడా భగవానుడే.
వృష్ణీనాం(వ్) వాసుదేవో౽స్మి, పాణ్డవానాం(న్) ధనఞ్జయః৷
మునీనామప్యహం(వ్ఁ) వ్యాసః(ఖ్), కవీనాముశనా కవిః৷৷37॥
వృష్ణివంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను. కవులలో శుక్రాచార్యుడను నేనే.
శ్రీకృష్ణపరమాత్మ వంశీకులను వృశ్నివంశజులు అంటారు. వారిలో ముఖ్యుడు తానే అని, పాండవులలో ముఖ్యుడైన అర్జునుడు తన రూపమే అని, మహర్షులలో ముఖ్యుడైన వేద వ్యాసుడు, భూత భవిష్యత్ వర్తమానాలను ( త్రికాలఙ్ఞానుడు) తెలుసుకోగలిగే శంకరాచార్యుడు తన విభూతులే అని భగవానులు ఈ శ్లోకంలో తెలిపారు.
దణ్డో దమయతామస్మి , నీతిరస్మి జిగీషతామ్৷
మౌనం(ఞ్) చైవాస్మి గుహ్యానాం(ఞ్), జ్ఞానం(ఞ్) జ్ఞానవతామహమ్৷৷38॥
శిక్షించువారిలో దండమును అనగా దమనశక్తిని నేనే. జయేచ్ఛకలవారినీతిని నేనే. గోప్యవిషయరక్షణమున 'మౌనము'ను నేను. జ్ఞానులయొక్క తత్త్వజ్ఞానమును నేనే.
సామ, దాన, భేద, దండోపాయాలలోని వాటిలో మానవులలో సత్ప్రవర్తన అలవరిచే న్యాయపరమైన దండన, విజయములోని నీతి, గోప్యంగా ఉంచవలసిన విషయాల రక్షణలో మౌనము, వివేకవంతులలోని వివేకము ఆ పరమాత్మయే.
యచ్చాపి సర్వభూతానాం(మ్), బీజం(న్) తదహమర్జున৷
న తదస్తి వినా యత్స్యాన్, మయా భూతం(ఞ్) చరాచరమ్৷৷39॥
ఓ అర్జునా! సర్వప్రాణులఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేనులేని చరాచరప్రాణియేదియును లేదు.
సమస్త జీవరాశులకు బీజప్రదాత భగవానుడే. ఆయన లేకుండా ఈ జగత్తులో దేనికీ స్తిరత్వం ఉండదు. సకల జీవకోటి అవసరాలను అమర్చేది పరమాత్మయే.
నాన్తో౽స్తి మమ దివ్యానాం(వ్ఁ), విభూతీనాం(మ్) పరన్తప৷
ఏష తూద్దేశతః(ఫ్) ప్రోక్తో, విభూతేర్విస్తరో మయా৷৷40॥
ఓ పరంతపా! నా దివ్యవిభూతులకు అంతమే లేదు. నా విభూతులవిస్తృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించితిని.
ఇంత అద్భుతమైన విభూతులకు అంతమే లేదని ,కొన్నిటిని మాత్రమే వివరించుతున్నానని ఈ శ్లోకంలో పరమాత్మ అర్జునునికి చెప్పారు. ఈ అధ్యాయంలో కృష్ణపరమాత్మ అర్జునునికి 82 విభూతుల గురించి 20 నుండి 42 పద్యాలలో తెలియజేసారు. ఆయన వలే ఆ విభూతులన్నీ కూడా మహిమాన్వితమైనవి,అనంతమైనవి.
యద్యద్విభూతిమత్సత్త్వం(మ్), శ్రీమదూర్జితమేవ వా৷
తత్తదేవావగచ్ఛ త్వం(మ్), మమ తేజోం౽శసమ్భవమ్৷৷41॥
విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను నా తేజస్సుయొక్క అంశమునుండియే కలిగినదిగా తెలిసికొనుము.
ఈ సృష్టిలో ఎట్టి సుందరమైన, వైభవోపేతమైన, సంపన్నమైన వస్తువైనా ,ఆ భగవానుని యొక్క తేజోమయ విభూతి అంశయే అని గ్రహించాలి. అన్నిటి వైభవాలకు ఆయన దివ్యశక్తియే మూలకారణము. కాంతిమయము, తేజోమయము అయిన వస్తువు భగవానుని శక్తి వలన కలిగినదని గ్రహించి గౌరవించాలి.
అథవా బహునైతేన, కిం(ఞ్) జ్ఞాతేన తవార్జున৷
విష్టభ్యాహమిదం(ఙ్) కృత్స్నమ్,ఏకాంశేన స్థితో జగత్॥42॥
ఓ అర్జునా! ఇంతకంటెను విపులముగా తెలిసికొని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణజగత్తును కేవలము నా యోగశక్తియొక్క ఒక్క అంశతోడనే ధరించు చున్నాను.
భగవానుని దివ్యవిభూతుల వర్ణనకు అంతమే లేదు. ఈ బ్రహ్మాండమంతా కూడా ఆయన అంశతో నిండి వున్నదే. ఈ విశ్వమంతా కూడా ఆయన చైతన్యముతో కూడి వున్నదే. అనంతమైన ఆయన రూపాన్ని మనము లెక్క కట్టలేము.
హరినామ సంకీర్తనతో ఈ నాటి వివేచన ముగిసి, ప్రశ్నోత్తర కార్యక్రమము ఆరంభమయినది. .
ప్రశ్న 1 :మనసులోని ఆందోళనను,కంగారును తొలగించుకోవడం ఎలా?
జవాబు :ఈ భవబంధాలలోనే పూర్తిగా మునిగిపోకుండా, మనసుని భగవానునిపై లగ్నం చేయాలి. మనకు గల బంధాలు, బాధ్యతల వలన మనవారికి ఏమి జరిగినా విపరీతంగా భయపడతాము. కాని ఈ బంధాలన్నీ తాత్కాలికమే అని గ్రహించుకోవాలి. భగవద్ ధ్యానంలో మనకు స్వాంతన లభిస్తుంది.
ఇంతటితో ప్రశ్నసత్రము పూర్తి అవగా, హనుమాన్ చాలీసా పారాయణము తరువాత సత్రసమాపన చేయబడినది.
హరినామ సంకీర్తనతో ఈ నాటి వివేచన ముగిసి, ప్రశ్నోత్తర కార్యక్రమము ఆరంభమయినది. .
ప్రశ్న 1 :మనసులోని ఆందోళనను,కంగారును తొలగించుకోవడం ఎలా?
జవాబు :ఈ భవబంధాలలోనే పూర్తిగా మునిగిపోకుండా, మనసుని భగవానునిపై లగ్నం చేయాలి. మనకు గల బంధాలు, బాధ్యతల వలన మనవారికి ఏమి జరిగినా విపరీతంగా భయపడతాము. కాని ఈ బంధాలన్నీ తాత్కాలికమే అని గ్రహించుకోవాలి. భగవద్ ధ్యానంలో మనకు స్వాంతన లభిస్తుంది.
ఇంతటితో ప్రశ్నసత్రము పూర్తి అవగా, హనుమాన్ చాలీసా పారాయణము తరువాత సత్రసమాపన చేయబడినది.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం(య్ఁ)
యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే విభూతియోగో నామ దశమో౽ధ్యాయః
ఈ విధముగా ఓం తత్ సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగ శాస్త్ర మయమైన, శ్రీకృష్ణార్జునుల సంభాషణ లేక సంవాద రూపములో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని పదవ అధ్యాయమైన విభూతియోగము సమాప్తమైనది